అమరావతి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ప్రొసీడింగ్స్లో పాల్గొనే ఉద్యోగుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచనలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా.. శానిటైజర్, మాస్క్ లు సరఫరా చేయాలని కోరింది. ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు పోలింగ్లో పాల్గొనే సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని పేర్కొంది. పోలింగ్లో పాల్గొనే సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.