ఆలయ పునః నిర్మాణానికి గన్ని విరాళం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్: స్థానిక భాస్కర్ నగర్లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి మందిరం పునః నిర్మాణానికి గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ విరాళం అందజేశారు. గతంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గన్ని అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం కంబాలచెరువు సెంటర్ లో ఉన్న వారి కార్యాలయంలో కమిటీ సభ్యులకు చెక్కును అందించారు.ఆలయ నిర్మాణం చక్కగా జరగాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విరివిగా చేయాలని గన్ని సూచించారు.ఈ కార్యక్రమంలో రాచపల్లి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.