VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 5:38 pm Posted by : shaikabdulla9733@gmail.com

గోకవరం ఇరుకు వంతెన వద్ద ట్రాఫిక్ జామ్

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

దేవి చౌక్ సెంటర్‌లోని ఇరుకు వంతెన వద్ద సోమవారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు.