VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 12:38 pm Posted by : VISWAM VOICE DAILY

ఫాదర్స్ డే నాడు ఓ తండ్రికి తీవ్ర శోకం..

ఖమ్మం జిల్లాలో దారుణం

ఖమ్మం, విశ్వం వాయిస్ న్యూస్:

ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి

ఇద్దరు కొడుకులు మృతి, తల్లి పరిస్థితి విషమం

ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్(7), తనిష్క్(5)లతో కలిసి నివాసం ఉంటున్న లింగరాజు, స్వాతి దంపతులు

కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి, తానూ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్వాతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించగా, విషమంగా ఉన్న స్వాతి ఆరోగ్యం