19 November 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Wednesday, November 19, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

చైర్ పర్సన్ రాణి ఆధ్వర్యంలో ఆదర్శలో వైఎస్సార్ జయంతి వేడుకలు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అనాథలకు అన్నదానం…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

సంక్షేమ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దిన మహోన్నతుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని మండపేట మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం 76వ జయంతి వేడుకల సందర్భంగా 7వ వార్డులో గల ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంధ సేవా సంస్థలో నిరుపేదల సమక్షంలో ఆమె కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. సంస్థలోని వృద్దులకు, అనాథలకు పలు రకాల ఆహార పదార్ధాలతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిర స్థాయిలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్సార్ అన్నారు.ఎన్నో ఏళ్ళుగా అనాథలను అభాగ్యులను అక్కున చేర్చుకుని ఆకలి కడుపులు నింపుతున్న ఆదర్శ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. సంస్థను నమ్ముకుని జీవిస్తున్న అనాథల కోసం నిర్వాహకుడు కొల్లి విశ్వనాథం చేస్తున్న సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మందపల్లి రవి కుమార్,షేక్&షేక్ మాజి కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా,సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధరం వైస్సార్సీపీ నాయకులు ఎర్రగుంట అయ్యప్ప,మొండి మురళి, సాధనాల శివ భగవాన్,తణుకు అశోక్,పేరూరి మాధవి, జొన్నపల్లి సత్తిబాబు,తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo