VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 4:46 pm Posted by : shaikabdulla9733@gmail.com

తంటికొండలో ఇంటికి దారి చూపించాలి

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన బద్దిరెడ్డి రాంబాబు తన ఇంటికి వెళ్లే మార్గంలోని ఆక్రమణను తొలగించి దారి చూపించాలని అధికారులను కోరారు. మంచినీటి చెరువుకు సంబంధించిన మినహా స్థలంలో ఆక్రమణ చేసి ఫెన్సింగ్ వేశారని ఆరోపించారు. కోర్టు తీర్పులు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు భిన్నంగా చెబుతున్నారని తెలిపారు. నకిలీ పత్రాలతో ఆక్రమణకు పాల్పడ్డారని, ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఆక్రమణ తొలగించాలని కోరారు.