విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
అధ్వానంగా రోడ్డు వెంటనే నిర్మించాలంటూ కొందరు గ్రామ మహిళలు రాయవరం తాసిల్దర్ కే జే ప్రకాష్ బాబు కి వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో ఎందరో ప్రజా ప్రతినిధులు ఉండగా కేవలం ఆ మహిళలే రోడ్డు అద్వానంగా ఉండటం గతంలో వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా రోడ్డుపై ధర్నా నిర్వహించి రోడ్డు వేస్తేనే కానీ ధర్నా విరమించబోమని అధికారులకు చెప్పడంతో వెంటనే అధికారులు రోడ్డు వేయడానికి రోడ్డు భవన శాఖ అధికారులు హామీ ఇచ్చారని రెవెన్యూ అధికారులు తెలపడంతో ధర్నాను విరమించారు. కానీ నేటి వరకు కూడా రోడ్డు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో మహిళలు మండల కేంద్రమైన రాయవరం సోమవారం తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి రోడ్డు సమస్యలపై ప్రతి పత్రం తాసిల్దార్ ప్రకాష్ బాబు అందజేశారు. ఈ నేపథ్యంలో గ్రామ మహిళలు మీడియాతో మాట్లాడుతూ మా రోడ్డు పరిస్థితి ఏమిటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామస్తులు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను చూసి అధికారులు వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మా డిమాండ్లను పెడచెవి పెట్టిన రోడ్డు వేయకపోయినా గుంతల రోడ్డులోనే టెంట్ వేసుకుని నిరసన తెలుపుతామని మహిళలు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం సిరికి చిన్నారి, గ్రంథ చిన్నారి, అమ్ములు, సత్య తదితరులు పాల్గొన్నారు.