విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని గురువారం రామచంద్రపురం డి ఈ, డి. శ్రీధర్ వర్మ స్థానిక విలేకరులకు తెలిపారు. డి ఈ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాయవరం సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మెయింటినెన్స్ నిమిత్తం విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తున్నట్లు అలాగే మరమ్మత్తుల సమయంలో సబ్ స్టేషన్ పరిధిలో ఆయా గ్రామాలకు రాయవరం, లొల్ల, సోమేశ్వరం, వెదురుపాక, నదురుబాధ, బిక్కవోలు మండలం కొమరిపాలెం, తోస్సిపూడి, కొంకూదురు గల గ్రామాలలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు డి ఈ వర్మ తెలిపారు.