పాఠశాలలో పూర్తిగా ఎన్నికల వాతవరణం…
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికలకు సంబందించిన విధి విధానాలు, నియమాలు, నిర్వహణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం శనివారం రాజ్యాంగ దినోత్సవం మరియు సోషల్ డే పురస్కరించుకొని శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాస రెడ్డి అధ్యక్షత నందు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం పి పి నౌడు వెంకటరమణ, సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో పూర్తిగా ఎన్నికల వాతవరణం కనిపిస్తుందని, సోషల్ డే నమూనా ఎన్నికలు జరిగిన తీరు చాలా సంతృప్తినిచ్చిందని, పిల్లలలో అవగాహన పెరిగిందని వారు అన్నారు. ఈ నేపద్యంలో ఎన్నికల బూత్ లను విద్యార్దులు ఏవిధంగా ఓటు హక్కు ఎలా వినియోగం చేసుకుంటున్నారు వారు పరిశీలించారు. ఎన్నికల ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. రాజకీయ నాయకులను ఏవిధంగా ఓట్లు వేసి ఎన్నుకోవాలో ప్రత్యక్షంగా తెలియజేశారు.
పాఠశాల గదుల్లో బ్యాలెట్ బాక్స్లు తయారు చేసి ఎన్నికల రిసిప్ట్తో సహా విదార్థులు నాయకులకు ఓటు వేశారు. పాఠశాలలో పలువురు విద్యార్థులు అభ్యర్థులుగా బరిలో నిలిచి ప్రచారం కొనసాగించడం, ఉపాధ్యాయులు ఎన్నికల సిబ్బందిగా వ్యవహరించి అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు దీరారు. నామినేషన్లు దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కిం పు, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రలు జారీ తదితర అంశాలపై అవగాహన కలిపించారు. మాక్ పోలింగ్ లో గెలుపొందిన వారిని హెచ్ ఎం అభినందించారు. కార్యక్రామానికి పర్యవేక్షణలు గా కె. రాజేష్ రెడ్డి, జి .సీతాదేవి, సబ్మెళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. అనంతరం సోషల్ టీచర్స్ కె. రాజేష్ రెడ్డి, జి సీతాదేవి, ఎస్. చంద్ర శేఖర్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పి ఎం సి చైర్మన్ నల్లమిల్లి నరేందర్ రెడ్డి, పి ఎం సి మెంబర్ తాడి దేవి, మంతెన అచ్యుతరామరాజు, పడాల కమలా రెడ్డి, వెలగల ఫణి కృష్ణారెడ్డి, పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ టీవీఎస్ చౌదరి, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ పి ఎస్ఎన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, స్టాఫ్ వాలంటీర్లు, తదితరలు పాల్గొన్నారు.