విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
వైకాపా సీనియర్ నేత ధూళిపూడి వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతిపట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మండలం సోమేశ్వరం వైకాపా సీనియర్ నేత ధూళిపూడి వెంకటేశ్వరరావు (59) హృద్రోగ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. సునితమనస్కులుగా గ్రామస్థులకు, నాయకులకు సుపరిచితులైన వెంకటేశ్వరరావు రెండు రోజులుగా అనారోగ్యంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయకు భార్య సుగుణ, కుమారుడు సాయిరామ్ ఉన్నారు. వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతిపట్ల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సర్పంచి ఎస్.ఆరీఫ్, ఎంపీపీ నౌడు వెంకటరమణ, జడ్పీటీసీ సభ్యురాలు నల్లమిల్లి మంగతాయారు, గరగ సోమన్న, గరగ శ్రీనివాస్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.