Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 12:35 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 12:35 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 12:35 PM
Follow Us

గోదావరి తోటకు కాపు కాస్తారని మంత్రి పదవి..?

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మండపేట:

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని జగన్ గట్టి సంకల్పంతో ఉన్నారు. ఈసారి గెలిస్తే ఇక రానున్న ఎన్నికలు నల్లీరు మీద నడకే అన్నది జగన్ మార్క్ పొలిటికల్ థియరీ. దానికి ఆయన లెక్కలు అంచనాలు ఉన్నాయి. అందుకోసం ఆయన అన్ని అవకాశాలూ వాడుకుంటున్నారు. తన మంత్రి వర్గం నుంచి కొందరిని తప్పించి మరికొందరిని చేర్చుకోవాలని చూస్తున్నారు.ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో పనికొచ్చే వారు. గట్టిగా నిలబడే వారు అన్ని విధాలుగా అండగా ఉండేవారికే మంత్రి పదవులు అన్నది జగన్ పెట్టుకున్న నియమంగా చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ ఉన్నారు. ఆయన మూడేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి.

దాంతో కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్ చూస్తున్నారు. అంతే కాదు కాపునాడు రాజకీయాల్లో చురుకుగా ఉంటూ సామాజికవర్గం పలుకుబడి ఉన్న సీనియర్ నేత ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులకు మంత్రి పదవిని జగన్ కట్టబెట్టాలని చూస్తున్నాట్లుగా తెలుస్తోంది.

తోట త్రిమూర్తులు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. పలు మార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి కోసం ఆయన ఎంతో ఎదురుచూశారు.కానీ దక్కలేదు.ఆ అసంతృప్తి ఆయనకు ఉంది. ఇక 2019లో ఆయన చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ చేతిలో రామచంద్రాపురంలో ఓటమి చూశారు.

ఆ తరువాత ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు రామచంద్రాపురం ఎమ్మెల్యే సీటు హామీ కూడా ఉందని అంటున్నారు.

ఇపుడు ఆయనకు మరో అవకాశం దక్కబోతోంది అని అంటున్నారు. త్వరలో జగన్ మంత్రి వర్గాన్ని విస్తరిస్తుననరు అని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా వేణుగోపాల క్రిష్ణకు మంత్రి వర్గం నుంచి సీటు చేజారుతుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే టైం లో తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి దక్కనుంది అని అంటున్నారు. రాజకీయంగా విశేష అనుభవంతో పాటు కాపులలో కీలకమైన నేతా ఉన్న తోట త్రిమూర్తులు కు ఎన్నికల వేళ మంత్రి పదవి కనుక అప్పగిస్తే ఆయన కచ్చితంగా గోదావరి జిల్లాలో ఫ్యాన్ స్పీడ్ పెంచుతారు అని అధినాయకత్వం ఆశిస్తోందిట. మొత్తానికొ తోట చిరకాల మంత్రి పదవి కోరిక జగన్ తీర్చబోతున్నారు అన్న మాట. మరి గోదావరిలో వైసీపీ జెండా రెపరెపాలడించే బాధ్యతను తోట స్వీకరిస్తారా. ఆయన సక్సెస్ రేటు చూపిస్తారా అన్నదే చూడాల్సి ఉంది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement