Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 19, 2024 11:45 AM

ACTIVE

India
44,499,261
Total active cases
Updated on March 19, 2024 11:45 AM

DEATHS

India
533,523
Total deaths
Updated on March 19, 2024 11:45 AM
Follow Us

పాపికొండల్లో జబర్దస్త్ వెంకీ సందడి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

వి.ఆర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్) 26;-

పాపికొండల్లో జబర్దస్తీ వెంకీ ఆదివారం సందడి చేశారు. భద్రాచలం రూట్ నుండి వి.అర్.పురం మీదగా పోచవరం బోటు పాయింటు వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి బోటుపై పాపికొండల్లోకి ప్రయాణం సాగించారు. బోటులో ఒక సెలబ్రెటీ ప్రయాణం చేయడంతో పర్యాటకులు ఆశర్యంగా చూశారు. వెంకీతో పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఎత్తయిన పాపికొండల్లో ప్రకృతి వాతావరణం ఎంతో బాగుందని వెంకీ తెలిపారు.

 

* డిప్లమాలో మిమిక్రీ కోర్ష్ చేశా

మొదటగా నేను డిప్లమాలో మిమిక్రీ కోర్ష్ చేశానని, కొన్ని టివిషో లో పనిచేసినట్లు, ఆ తరువాత జి తెలుగులో యాంకరింగ్ చేసినట్లు , ప్రస్తుతం జబర్దస్తలో చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో డైరెక్టర్ గా ముందుకు వస్తానని తెలిపారు.

* బోటు జర్నీ చాలా బాగుంది.

ఈ గోదావరి నదిపై బోటు జర్నీ చాలా బాగుందని, యంటర్టైన్ మెంట్ చాలా బాగుందని, యాంకర్, డ్యాన్సర్లు డ్యాన్సులు చేసి పర్యాటకులను

ఆనంద పరుస్తున్నారని అన్నారు. అనంతరం పిల్లలు పడుకునే చిట్టిచిలకమ్మ పాటకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ల మాటలతో మిమిక్రీ చేసి పర్యాటకులను నవ్వించారు. ఈ జర్నీ చాలా బాగున్నట్లు వెంకీ సంతోషం వ్యక్తం చేశారు.

* యాంకర్ ప్రసాద్ ని అభినందించిన వెంకీ

బోటులో ఉన్న యాంకర్ ప్రసాద్ ని, మరో ఇద్దరు డ్యాన్సర్ లని వెంకీ అభినందించారు. ప్రసాద్ కూడా ప్రస్తుతం టివి లలో వచ్చే డి జోడీలో సైడ్ డ్యాన్సర్ గా పనిచేస్తున్నాడు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement