Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,169,711
Total recovered
Updated on April 1, 2023 1:15 AM

ACTIVE

India
15,208
Total active cases
Updated on April 1, 2023 1:15 AM

DEATHS

India
530,867
Total deaths
Updated on April 1, 2023 1:15 AM

** దేశ భక్తిని చాటుదాం **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్:

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి దేశభక్తిని చాటేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన కార్పొరేషన్‌ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ అజాది క అమృత్‌మహోత్సవ్‌ సందర్భంగా ‘దేశ్‌ కి తిరంగ్‌’ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో జాతీయత భావాన్ని, దేశభక్తిని పెంపొందించడంతోపాటు భారత రాజ్యాంగం పట్ల బద్దులై ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడమే ముఖ్యోద్దేశ్యమన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రతీ ఒక్కరూ తమ ఇళ్ళ వద్ద జాతీయ పతాకాలను ఎగురవేయడం, ఆయా అంశాలపై సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!