విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లర్ల లో అరెస్ట్ అయిన 234 మంది ముద్దాయిలను శనివారం నాడు విచారణ కొరకు అమలాపురం కోర్టు తీసుకురాగా అల్లర్లలో అరెస్ట్ అయిన ముద్దాయి బంధువులు బెయిల్ మంజూరు చేయాలని కోర్టు బయట ఆందోళన చేపట్టడంతో నల్లవంతెన నుంచి గడియార స్తంభం వైపు వెళ్ళు మార్గం అరెస్ట్ అయిన వారి బంధువులతో కిక్కిరిసిపోయింది దీంతో నల్లవంతెన నుంచి గడియార స్తంభం వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసు వారు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపు చేశారు