విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
శ్రీ వేంకటేశ్వరా డిగ్రీ కళాశాలలో దివీస్ ల్యాబ్ క్యాంపస్ డ్రైవ్.భూపయ్య అగ్రహారం లోని స్థానిక శ్రీ వెంకటేశ్వరా డిగ్రీ కాలేజ్ నందు దివీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపిక లో 196 మంది విద్యార్థులు హాజరు కాగా 20 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాదించారు.ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ను కళాశాల కరెస్పాండెంట్ శ్రీ కె.వి.ఆర్.ఎన్ నరసింహారావు,ప్రిన్సిపాల్ కె.మనోహర్. ఏ ఓ కరాటం ప్రవీణ్,హెచ్ ఆర్ లు రాజేష్,పూర్ణ ప్రసాద్,ప్లేస్మెంట్ ఆఫీసర్స్ యాలంగి వరప్రసాద్, చోడే జాన్ పాల్, బి. శ్రీనివాస్, కె.శ్రావణ్ దిలీప్,మల్లిపూడి విజయలక్ష్మి ఎమ్.అఖిలకుమార్,ఎమ్.శివప్రసాద్, ఎమ్.రామారావు తదితరులు అభినందించారు.