ప్రభుత్వ అరాచకాలకు బలైన వారి పరామర్శకు వెళితే ఎందుకు అనుమతించడం లేదు..??
మీరు ఓదార్పు యాత్ర చేయలేదా…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
నారాలోకేష్ ఉత్తరాంధ్ర పర్యటనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య..
ప్రభుత్వ అరాచకాలకు బలైన వారి పరామర్శకు వెళితే ఎందుకు అనుమతించడం లేదు..??
మీరు ఓదార్పు యాత్ర చేయలేదా… అప్పటి ప్రభుత్వం అడ్డుకుందా…
ఇప్పుడు మీ తప్పులు బయటపడతాయని భయంతో అడ్డుకుంటున్నారా…
ఈ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు..
ప్రశ్నిస్తే కేసులు, దాడులు లేదా అంతమొందించడం..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. అంబేడ్కర్ రాజ్యాంగం మానేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు..
బాధితులను పరామర్శించడానికి పోలీసులు అనుమతి కావాలా..
మీ ముందటి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యస్ఫూర్తిని మరిచి మిమ్మల్ని అడ్డగించి ఉంటే మీరు ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేయగలిగేవారా..??
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను విమానాశ్రయం వద్ద ఎందుకు అడ్డుకున్నారు..అడ్డుకున్నందుకు కారణాలు లిఖిత పూర్వకంగా ఇవ్వాలి, లేదా పర్యటనకు అనుమతి ఇవ్వాలి అని బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు.
అధికార పార్టీకి తలొగ్గి ఇలాంటి చర్యలకి పాల్పడే పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి మాత్రమే జీవితకాల అధ్యక్షుడు అని, ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి కాదని గుర్తుపెట్టుకోవాలి.