విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
గడపగడపకు కార్యక్రమంలో పొన్నాడ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముమ్మిడివరం నగర పంచాయతీ నందు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో పాల్గొని టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల అలంకరించి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాట వీరుల్లో ఆంధ్ర కేసరి ఒకరిని మహోన్నతమైన న్యాయవాద వృత్తిని విడిచి స్వతంత్ర పోరాటంలో పాల్గొని తెల్లవారి తుపాకీ కి గుండెను చూపించి నిలిచిన ధైర్యశాలి అని ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అటువంటి మహనీయుని జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని తెలియజేశారు అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు మల్లాయి పాలెం, రాంజీ నగర్, టి.టి.ఆర్ నగర్, ప్రతి కుటుంబం లో సుమారు 200 మంది లబ్దిదారులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పధకాలు గురించి అడిగి తెలుసుకున్న ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గౌరవ శ్రీ *పొన్నాడ వెంకట సతీష్ కుమార్* . గ్రామంలో ఉన్న సమస్యలు ను గుర్తించి వెంటనే పరిష్కారం అయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా డ్రైన్స్ మరియు రోడ్లు కి సంబంధించి పనులు వేగవంతం అయ్యేలా చూడాలని అధికారులని ఆదేశించారు. అలాగే సంక్షేమ పధకాలు కి సంబంధించి పెండింగ్ ఉన్న వాటిని వెంటనే అమలు అయ్యేలా చర్యలు తీసుకుని లబ్ధిదారులకు అందేలా చూడాలని సచివాలయ సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు. అధికారులు, కార్యకర్తలు, వాలంటీర్లు, అభిమానులు, కుటుంబ సభ్యులు అధిసంఖ్యలో పాల్గొన్నారు..