విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
అమలాపురం విశ్వః వాయిస్ న్యూస్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘ ఆవరణ నందు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు పురస్కరించుకుని అమలాపురం పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు అలంకరించి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వీఐపీ నాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులలో ధైర్య సాహసాలు కలవాలని ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేశారని తెల్లవారి తుపాకీ కి ఎదురు నిలిచి తన గుండెను చూపించి ఆంధ్ర కేసరి అయ్యారని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో అమలాపురం పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి మున్సిపల్ కమిషనర్ వి.ఐ.వి నాయుడు పురపాలక సంఘ మేనేజర్ ఎం వి ఎస్ ఎన్ మూర్తి డి ఈ ఈ కే. అప్పలరాజు అసిస్టెంట్ ఇంజనీర్లు వార్డు సభ్యులు పురపాలక సంఘ ఇండోర్ మరియు ఔట్డోర్ సిబ్బంది పాల్గొన్నారు