విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రాపురం:
అవినీతి రహితంగా ప్రజలకు చేరుతున్న పథకాలు
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్.
**ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు* *గ్రామ సచివాలయాలు ద్వారా అవినీతి రహితంగా అత్యంత* *పారదర్శకంగా అమలవుతున్నాయి*
*రాష్ట్ర బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ సమాచార పౌర* *సంబంధాల శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ.*
బుధవారం సాయంత్రం మంత్రి, రామచంద్రపురం పట్టణంలో 19 వార్డ్ , 9వ సచివాలయం పరిధిలో కుమ్మరి వారి సావరంలో గడపగడపకు మన ప్రభుత్వం లో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరుగుతూ లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని వీటిలో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే త్వరలో పరిష్కరించి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వీర సత్యవేణి,రూ.1,27,913/ గోలి కొండమ్మ,రూ.1,19,522/ పళ్ళ జగపతి రామయ్య,రూ.86971 ఈ పథకాల ద్వారా మాకు మా కుటుంబ సభ్యులకు చాలా ప్రయోజనం కలిగిందని దాంతోపాటు సంతోషంగా జీవిస్తున్నామని లబ్ధిదారులు వివరించారు. అనంతరం మంత్రి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి అందుతున్న ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఆసరా, పెన్షన్, కాపు నేస్తం తదితర సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న తీరును అడిగి తెలుసుకుని, సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంట్రీలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నా
రు.