విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి సిటీ:
మదర్ థెరిసా అవార్డు అందుకున్న చాన్ బాషా
– అభినందన సత్కారం చేసిన
ప్రముఖులు
రాజమహేంద్రవరం,(విశ్వం వాయిస్ న్యూస్): మదర్ థెరీసా జయంతిని పురస్కరించుకుని న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నూర్ బాషా ముస్లీం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎ.పి. జేఏసీ ఉద్యోగుల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ సలహాదారు షేక్ చాన్ బాషాకు మదర్ థెరీసా అవార్డు అందచేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. శనివారం రాజమండ్రి విచ్చేసిన చాన్ బాషా ను నగర ప్రముఖులు ముస్లీం సోదరులు ఘనంగా సన్మానించారు.రాజమండ్రి నగర ముస్లీం సంక్షేమ సంఘం కన్వీనర్ హబీబుల్లా ఖాన్ అధ్యక్షతన జాంపేట లబాబిన్ లైన్ మసీదులో శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు.విశిష్ట అతిథులుగా జేఏసీ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎంప్లాయీస్ టీచర్స్, వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కేతా శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా చైర్మన్ టి.వి.వి.ఎస్ ప్రసాద్,గౌరవ సలహాదారులు నెక్కల గోవిందరాజులు,పిట్టా వరప్రసాద్, కేశవరావు, నాయుడు, ముస్లీం నాయకులు సయ్యద్ రబ్బాని,హుక్కుంపేట మీరా, ఇబ్రహీం బాషా,ఎం.డి.నసీముద్దీన్,ఎం.డి.జహంగీర్,మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.