విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
సెప్టెంబర్ 2న రంగ రంగ వైభవంగా చిత్రం విడుదల
– రాజమహేంద్రవరంలో చిత్ర యూనిట్ సందడి
రాజమహేంద్రవరం,(విశ్వం వాయిస్ న్యూస్):
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రూపొందించిన ‘ రంగ రంగ వైభవంగా’ చిత్రాన్ని సెప్టెంబర్ రెండో తేదీన విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరం షేల్టన్ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం వెల్లడించింది. హీరో వైష్ణవ తేజ్, హీరోయిన్ కేతిక శర్మ,నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్,గిరిసాయా మాట్లాడారు.సెప్టెంబర్ రెండవ తేదీన మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు యూనిట్ వెల్లడించింది. ప్రేక్షకుల్ని అలరించేలా మంచి కుటుంబ కథా నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలిపారు.హీరో, హీరోయిన్లు అద్భుతంగా ఈ చిత్రంలో నటించారని పేర్కొన్నారు. ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి తమ చిత్రాన్ని చూసి ఆద రించాలని కోరారు.