విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
– 5000 వేలమందికి భక్తులు అన్నదాన ప్రసాదం వితరణ
– కమిటి వారిని అభినందించిన వాసంశెట్టి గంగాధర్,బాక్స్ ప్రసాద్
32వ వినాయక చవితి మహోత్సవం శ్రీ విఘ్నేశ్వర క్యాటరింగ్ వర్కర్స్ మరియు లక్ష్మీ గణపతి హోటల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గణపతి పూజా కార్యక్రమంఅర్చకుల పూజ, వేద మంత్రాలతో ప్రారంభించారు. స్థానిక గోకవరం బస్టాండ్ ఆనం కళాకేంద్రం వద్ద చవితి మహోత్సవాల సందర్భంగా పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధర్,యూనియన్ గౌరవ అధ్యక్షులు,మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ లు వినాయక చవితి వేడుకలకు హాజరయ్యి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వర క్యాటరింగ్ వర్కర్స్ మరియు లక్ష్మీ గణపతి హోటల్ వర్కర్స్ యూనియన్ వినాయక చవితి మహోత్సవాలు గత 32 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముందుగా కమిటీ వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అనేక రకాల పిండి వంటలు,ఎంతో రుచిగా వీరు సొంతంగా తయారు చేసి ఇన్ని వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందించడం చాలా సంతోషదాయక మన్నారు.కమిటీ సభ్యులు నిరంతరం ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ వారికి ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా బాక్స్ ప్రసాద్, వాసంశెట్టి గంగాధర్ వారి ఇరువురికి కమిటీ ఆధ్వర్యంలో శాలువా కప్పి జ్ఞాపకతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గాలి సత్తిరెడ్డి, సతీష్ కుమార్, మధు, నాగరాజు, సత్యనారాయణ,రాము,విజయ్ కుమార్,దుర్గ,రాజు,వెంకటేశ్వరరావు,అశోక్ తదితరులు పాల్గొన్నారు.