విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్ :
ఈ నెల 4న నేషనల్ క్లినికల్ యాక్ట్పై సదస్సు ను రాజమహేంద్రవరం హెల్త్ ఆఫీసర్ ఆఫీసర్ డాక్టర్ గెడ్డం మధుబాబు మరియు నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ గెట్ టు గెదర్, నేషనల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్`2010 రీ ఎంబర్స్మెంట్ ఫర్ ఆయుర్వేద హాస్పటల్స్ అనే అంశంపై 4వ తేదీ ఆదివారం రాజమహేంద్రవరంలో గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలను ప్రొగ్రామ్ కన్వీనర్లు డాక్టర్ ఎస్.అజయ్ కుమార్, డాక్టర్ సురి రఘురామ్, డాక్టర్ కె.విజయకుమారి వెల్లడించారు. నేషనల్ మెడికల్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ యూనిట్ ఏర్పాటుపై చర్చించడం జరుగుతుందని తెలిపారు.స్థానిక శేషయ్య మెట్టలో ఉన్న లా హాస్పిన్ హోటల్లో ఆదివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు.