విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్ :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాజమహేంద్రవరం వి ఎల్
పురంలో జనసేన పార్టీ 10వ వార్డ్ నాయకులు పల్లంటి సంజీవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, యనుమల రంగ బాబు , దొండపాటి సత్యంబాబు, ఏడిధ భాబి పాల్గొన్నారు.ముఖ్య అధితులు చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి చిన్నారులకు అందించారు.ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర మంచి సేవా గుణం కలిగిన ప్రజానేత అధినేత పవన్,ఆయన చేసే ప్రతి యుద్ధం అవినీతి పై ఉంటుంది ,రాష్ట్రంలో మేము అధికారంలో లేక పోయిన ప్రజలకు ,రైతుల కోసం పనిచేస్తున్న ఆయన ఇస్తున్న రైతులకు సహాయం ఎనలేనిది అని,రానున్న రోజుల్లో పవన్ సేవలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ ఆయనను కొనియాడారు.సంజీవ్ మాట్లాడుతూ ఈ వేడుకలు విచ్చేసిన అనుశ్రీ కి,రంగ బాబుకి, సత్యం బాబుకి, ముఖ్య నాయకులకు, సహకరించిన అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు.
సత్యనారాయణ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వైవిడి ప్రసాద్, అల్లాటి రాజు,గుణ్ణం శ్యామ్ సుందర్,ఏవిడి ప్రసాద్,నగర కార్యవర్గ సభ్యులు,రాజమండ్రి జనసేన నగర నాయకులు, స్థానిక పెద్దలు, యువత తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.