Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 8:30 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 8:30 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 8:30 AM
Follow Us

స్పందన ద్వారా వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

స్పందన ద్వారా వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలి…

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిపిఓ వి కృష్ణకుమారి….

 

 

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:

సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో గ్రామ పరిశుభ్రత విషయంలో తగిన చర్యలు చేపట్టాలని డిపిఓ వి. కృష్ణకుమారి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రమైన రాయవరం ఎంపీడీవో కార్యాలయం సమావేశం మందిరంలో బుధవారం ఎంపీడీవో డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా పంచాయతీ అధికారి వి కృష్ణకుమారి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రభలవుతున్న తరుణంలో గ్రామాలలో పారిశుధ్యం పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, స్పందన ద్వారా వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా సత్తర్వమే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని డిపిఓ పేర్కొన్నారు.

త్రాగునీరు, వీధి లైట్లు ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. డిసెంబర్ నెలాకారులోపు ఇంటి పన్ను బకాయిలను వెంటనే వసూలు చేయాలని సచివాలయ గ్రామ కార్యదర్శిలకు ఆదేశించారు. ఈనెల 15వ తారీకు నుండి 30 వ తారీకు వరకు నిర్వహించే గ్రామ పరిశుభ్రత వారోత్సవాలు జరపాలని తదితర అంశాలపై డిపిఓ కృష్ణకుమారి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాయవరం గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.

ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ ఎం. రామకృష్ణారెడ్డి, మండలంలో ఉన్న గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు, ఇన్చార్జ్ ఈవోపీఆర్డి ఏ గోవిందరాజులు, గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement