విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ గాయపడిన వలంటీర్ మృతి
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ గ్రామ వాలంటరీ మృతి చెందినట్లు హాస్పటల్ నుండి వచ్చిన డెత్ ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ పి వెంకటేశ్వరరావు గురువారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఏఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం
మండలంలోని పసలపూడి శివారు ఎర్రమట్టిపురం స్నాన పుట్టాల వద్ద మోటారు సైకిల్ను వ్యాన్ ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వలంటీర్ మిడియాల మోహన్ గాంధీ (22) చికిత్స పొందుతూ గురువారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈనెల 14న మోటారు సైకిల్పై వెళ్తున్న మోహన్ గాంధీ, అతని మామయ్య జె. సుబ్రహ్మణ్యంలను వ్యాన్ డీకొ ట్టిన ప్రమాదంలో సుబ్రహ్మాణ్యం మృతి చెందిన సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
చికిత్స పొందుతూ మోహాన్గాంధీ మృతి చెందడంతో ఒక్కరోజు తేడాలో మామ, అల్లుళ్లను మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.