విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాజమండ్రిలో ఘన స్వాగతం లభించింది.గురువారం ఉదయం ఢిల్లీ నుండి బయల్దేరిన ఆయన ఉదయం 11.30 గంటలకు రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా నగరంలోని ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్న ఆయనకు వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సాదర స్వాగతం పలికారు.అలాగే జిల్లా కలెక్టర్ కే మాధవీలత పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. వర్చువల్ విధానంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ప్రారంభించి, సభలో ప్రసంగించిన అనంతరం కడియం నర్సరీలను సందర్శించేందుకు కేంద్ర మంత్రి,ఎంపీలు, ఎమ్మెల్యేలు,అధికారులు బయల్దేరి వెళ్లారు.