విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పనిసరిగా అమలు జరపాలి
– అంబేద్కర్ ముని మనుమడు రాజారత్నం అంబేద్కర్
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
రాజమహేంద్రవరం విచ్చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ముని మనవడు రాజారత్నం అంబేద్కర్ ను, స్థానిక గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ కాంశ్య విగ్రహం వద్ద తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాల ఐక్యవేదిక ఘనంగా సత్కరించింది.ఈ సందర్భంగా రాజారత్నం అంబేద్కర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాలను చదివి వివిధ కులాలు,మతాలు, వర్గాలు, సంస్కృతి గల భారతదేశంలో ప్రజలు సుభిక్షంగా జీవించడానికి ఆయన అందించిన భారత రాజ్యాంగాన్ని తూచా తప్పక అమలు జరిపి ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత నేటి పాలకులపై ఉందని పేర్కొన్నారు.ఈ సమావేశానికి జిల్లా ఎస్సీ ఎస్టీ నాయకులు కోరుకొండ చిరంజీవి అధ్యక్షత వహించగా తాళ్లూరు బాబు రాజేంద్రప్రసాద్, కాశీ నవీన్ కుమార్, వైరాల అప్పారావు, దండాలు యాకోబు,సమతం గన్నేయ్య పులిదుండి ఆనంద్ కుమార్, ఎల్.వి.ప్రసాద్, కె.ఎన్.వెస్లీ,అర్ధలా కుమార్ బాబు,వేమగిరి వెంకటేశ్వర రావు,బొంతా శ్యామ్ రవి ప్రకాష్,డాక్టర్ చైతన్ శేఖర్, ఎం.పి.డి. కృపవరం,సి.హెచ్ సుబ్బారావు, మర్రి బాబ్జి, కూర్మయ్య, కొల్లి వెంకట నరసింహారావు, ఆర్.బి.మాధవ్ రావ్, కండవల్లి లక్ష్మి, డాన్ సూరి, తోలేటి రాంప్రసాద్, భీమారావు,వైరాల రమేష్, అనకాపల్లి పండు,నక్క సోమేశ్వర రావ్, జె.అబ్బులు, చోళ రాజు,తురకల నిర్మల,మోతా నాగలక్ష్మి, బేబీ ప్రశాంతి,కొమర్తి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.