విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కిర్లంపూడి:
*కిర్లంపూడి (విశ్వం వాయిస్ న్యూస్)*
*సెప్టెంబర్ 30*
శ్రీ పంతం చిట్టిబాబు మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, గెద్దనాపల్లి విద్యార్థులైనా శృంగారాయుని పాలెం గ్రామానికి చెందిన కంఠంరెడ్డి రాంబాబు, సుజాత దంపతుల కుమార్తె చిరంజీవి కంఠంరెడ్డి తేజస్విని కి IIIT నూజీవీడు నందు, పెద్దనాపల్లి గ్రామానికి చెందిన సుందరపు శ్రీనివాసరావు, జోగాలక్ష్మి దంపతుల కుమారుడు చిరంజీవి సుందరపు తరుణ్ కు IIIT శ్రీకాకుళం నందు సీట్లు సాధించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దంతులూరి వేంకటపతి రాజు గారు, మండల విద్యాశాఖాధికారి శ్రీ టి. జోసెఫ్ గారు, విద్యాకమీటీ చైర్ పర్సన్ శ్రీమతి బోనాసి గంగాభవాని గారు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పాఠశాల విద్యార్థులందరూ వీరికి శుభాకాంక్షలు తెలిపారు.