విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
**కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్య తో బాధపడుతున్న చిన్నారి కి*
*ఆర్థిక సాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్న తల్లిదండ్రులు*
*విశ్వం వాయిస్ వార్తకు స్పందించి ముందుకు వచ్చిన దాతలు*
*వన్నె చింతలపూడి వైఎస్ఆర్సిపి నాయకులు*
అమలాపురం(విశ్వం వాయిస్)
కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్య తో బాధపడుతున్న చిన్నారి చికిత్స నిమిత్తం వన్నెచింతలపుడి వైస్సార్సీపీ నాయకులు ఆర్థిక సాయం అందించారు. అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి కి చెందిన మోరంపూడిప్రభుదేవా,లావణ్య దంపతులు నిరుపేదలు.వీరికి చెందిన రెండు సంవత్సరాల వయస్సున్న మోరంపూడి గౌతమ్ కళ్యాణ్ కు కాలేయం,కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడంతో అస్వస్థతకు గురై విజయవాడ రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్సకు అధిక మొత్తంలో ఖర్చు కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోతున్నారు. విశ్వ వాయిస్ పత్రికలో వచ్చిన వార్తకు స్పందించి సదరు గ్రామానికి చెందిన చిన్నారి కి ఆర్థిక సాయం లేక వైద్యానికి ఇబ్బంది పడుతున్నడని మనసు చలించిన గ్రామస్తులు వన్నెచింతలపుడి వైస్సార్సీపీ సీనియర్ నాయకులు జంపన రమేష్ రాజు ఆధ్వర్యంలో విజయవాడ రెయిన్ బో ఆసుపత్రి వెళ్లి చిన్నారి ని చూసి తల్లిదండ్రులు కు మేము అంతా మీకు అండగా ఉంటామని మనోధైర్యాన్ని నింపి చిన్నారి వైద్యానికి 20 వేలు ఆర్థిక సాయం గా అందించారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పరమట గోపాలరావు,మాజీ సర్పంచ్ పరమట మోహన్ కుమార్,పరమట విష్ణు ప్రసాద్,మాజీ వార్డు నంబర్ బింగు గోపాలం తదితరులు పరామర్శించారు