ఆయన ఆశయాలు ఆయన పోరాటం పూర్తిగా తీసుకోవాలి.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
దేశం గర్వించదగ్గ మహనీయులు జాతిపిత మహాత్మాగాంధీ
– రుడా కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
నా జీవితమే నా సందేశం అని చాటిన మహనీయుడు గాంధీజీ అహింసాయుత మార్గంలోనే ఆయన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ప్రపంచానికి ఆయన అందించిన పదునైన ఆయుధం అది.మహాత్మా అందించిన అహింసా ఉద్యమం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన ఎంచుకున్న బాట ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఓ పాఠ్యాంశంగా మారింది. గాంధీ జీవితం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, నడిపిన ఉద్యమాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి అన్నారు. ఆదివారం రుడా కార్యాలయంలో మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రుడా సెక్రటరీ శైలజవల్లి మరియు రుడా ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.