పేపర్ మిల్లు యాజమాన్యం ఈ సమస్యపై వెంటనే స్పందించాలి.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
పేపరు మిల్లు లిక్కర్ బ్రాయిలర్ నుండి వచ్చే రసాయన వ్యర్ధాలు కారణంగా గోదావరి జలాలు కాలుష్యం బారినపడుతున్నాయని, అలాగే దీని ద్వారా వచ్చే దుర్గంధంతో స్థానికులు ప్రమాదకర వ్యాధులు బారినపడుతున్నారని 41వ డివిజన్ గుర్రం జాషువా ఎస్సీ ఫీల్డ్ లేబర్ సొసైటీ, వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మర్రి పుష్పరాజ్ ఆరోపించారు. పేపరు మిల్లు కాలుష్యం నుంచి స్థానికులను, గోదావరి జలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ పుష్పరాజ్ నేతృత్వంలో స్థానిక కోటిలింగాల ఘాట్ వద్ద ఉన్న పేపరు మిల్లు ఇన్ టేక్ వాటర్ హౌస్ వద్ద స్థానికులు ధర్నా చేపట్టారు. కాలుష్యం బారి నుంచి రక్షించాలి, పేపరు మిల్లు యాజమాన్యం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ పేపరు మిల్లు లిక్కర్ బాయిలర్ నుంచి రసాయన జలాలను తూర్పు లంకల్లోకి వదులుతున్నారని, అలాగే కోటిలింగాల పేటకు ఆనుకుని ఉన్న లిక్కర్ బాయిలర్ నుంచి వస్తున్న దుర్గంధం వల్ల ప్రజలు కిడ్నీ, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు లంకల్లో పేద ప్రజానీకం ఉపాధి కోసం 84 ఎకరాలు భూమిని ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని, ఈ భూమి కాలుష్యం బారినపడి ఏ పంట పండడం లేదన్నారు. ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఈ విషయమై పేపరు మిల్లు యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందనలో కూడా ఫిర్యాదు చేశామన్నారు. తక్షణం కాలుష్య సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం చేసే వరకూ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. జేబి గిరిధర్ మాట్లాడుతూ తక్షణం కాలుష్యం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అర్బన్ తహసీల్దార్ సుస్వాగతం, త్రీ టౌన్ సీఐ జి మధుబాబు అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. సోమవారంలోగా సమస్య పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. అయితే సమస్య పరిష్కారం అయ్యే వరకూ తగ్గేదేలే… అంటూ పుష్కరాజ్ నిష్పష్టటంగా వెల్లడిరచారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సుంకర బుజ్జి, నూకతట్టు రాజశేఖర్, వల్లూరి అరుణ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.