విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
సేవా పతకాలు పొందిన పోలీసులను సన్మానించిన జిల్లా ఎస్పి
కాకినాడ సిటీ,విశ్వం వాయిస్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, ఒకరికి ఉత్తమ సేవా పథకం, నలుగురు పోలీసులకు సేవ పతకాలను నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేసింది.పతకాల పొందిన గ్రహీతలను జిల్లా ఎస్.పి జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి, పుష్పగుచ్చాలు అందించి, దుశ్శలువాలతో సన్మానించారు.
డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్మ్ డ్ రిజర్వులో పనిచేస్తున్న
కె. కృష్ణమూర్తి, ఏ.ఆర్.హెచ్.సి. 1676 కు ఉత్తమ సేవా పథకం, కాకినాడ జిల్లాదిశ పిఎస్ సిహెచ్. చిదంబర కుమార్, ఎస్.ఐ.1726, కాకినాడ జిల్లా,అర్మెడ్ రిజర్వ్
జె. రామారావు, ఏ.ఆర్.ఎస్.ఐ. 427,
కాకినాడ జిల్లా,టూ టౌన్ ఎల్&ఓ., పిఎస్. ఎం. వెంకటేశ్వరరావు ఏ.ఎస్.ఐ. 803, టూ టౌన్ ఎల్&ఓ., పి.ఎస్.
కాకినాడ జిల్లా,టూ టౌన్ సి.సి.ఎస్.
జి. బలరాం మూర్తి, హెచ్.సి. 1419 కు సేవా పతకాలు పొందారు
వీరి సేవలు సేవలు పోలీస్ శాఖలో పనిచేయుచున్న సిబ్బందికి స్పూర్తిదాయకం – మరింత బాధ్యతాయుతంగా పనిచేసే చేసి, ప్రజలకు సహకారంగా ఉండి, పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ పి.శ్రీనివాస్, అదనపు ఎస్పీ ఏఆర్ బి. సత్యనారాయణ, ఎస్బి డిఎస్పి ఎం.అంబికా ప్రసాద్, డిఎస్పి, ఏఆర్ అప్పారావు, జిల్లా పోలీస్ ఆఫీస్ ఏవో నాయక్, ఇన్స్పెక్టర్లు, రిజర్వు ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.