విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
రాజమహేంద్రవరం బాలాజీ పేట వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది
– పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
– 9 రైళ్లు రద్దు
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
రాజమహేంద్రవరం రైల్ వే స్టేషన్ సమీపంలో బాలాజీ పేట జంక్షన్ వద్ద ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐ ఎల్ టి డి ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.రాజమండ్రి రైల్వే స్టేషన్ నందు సరకు రవాణా రైలు పట్టాలు తప్పిన కారణంగా, రత్నాచల్, సింహాద్రి, ఉదయ్, కాకినాడ- విజయవాడ- కాకినాడ ఎక్స్ ప్రెస్ రైళ్ళు, గుంటూరు నుండి సాయంత్రం 04:45 గంటలకు మరియు విజయవాడ నుండి ఉదయం 09:45 గంటలకు బయలుదేరవలసిన గుంటూరు- విజయవాడ- గుంటూరు రైళ్ళు ఈ రోజు రద్దు చేయబడినవి.