ఈ నెల 29న తేదీన ఉదయం 10 గం.లకు
మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్గజీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రాజానగరం మండలం, కొండగుంటూరు మాదిగపేట లో జరుగుతుందని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి గోదావరి జిల్లాల కన్వీనర్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ,రాజానగరం మండలం ఎస్సీ సెల్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కొల్లి వీర వెంకటరమణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రఘు మాదిగ, ఎం.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి వైరాల అప్పారావు మాదిగ పేర్కొన్నారు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
నవంబర్ 29వ తేదీన ఉదయం 10 గం.లకుమాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్గజీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రాజానగరం మండలం, కొండగుంటూరు మాదిగపేట లో జరుగుతుందని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి గోదావరి జిల్లాల కన్వీనర్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ,రాజానగరం మండలం ఎస్సీ సెల్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కొల్లి వీర వెంకటరమణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రఘు మాదిగ, ఎం.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి వైరాల అప్పారావు మాదిగ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం సిమెంట్రిపేటలోని బాబు జగజీవన్ రామ్ కమ్యునిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన రాజానగరం మండలం, కొండ గుంటూరు గ్రామంలో భారత తొలి ఉప ప్రధాని మాదిగ జాతి మహోన్నత నేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణ జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మహాజన సోషల్ పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరై విగ్రహావిష్కరణ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యావన్మంది మాదిగలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోలేటి రాంప్రసాద్ మాదిగ, వైరాలు రమేష్,డాన్ సూరి,యల్లారావు,పల్లేటి మాధవరావు,అదిఆంధ్ర హరిజన సొసైటీ ప్రెసిడెంట్ కొల్లి రమణ,పల్లేటి శివాజీ,పల్లేటి యేసు,అనంతవపురం గాంధీ,బుద్దాల కుమార్, జొన్నాడ రాకేష్,గరబారపు శ్రీను,కొల్లి సుందరం, నిడదవోలు ఎంఎస్పీ నాయకులు వెంకట్రావు మాదిగ,వీరబాబు,తదితరులు పాల్గొంటారని తెలిపారు.