విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కొత్తపేట:
*కొత్తపేటవద్ద బోడిపాలెం వంతెన నిర్మాణానికి సీఎం జగన్ హామీ*…
. *కేదార్లంక సర్పంచ్ వీది వెంకట రెడ్డి బాబు*.
కపిలేశ్వరం మండలం విశ్వ వాయిస్ న్యూస్ రిపోర్టర్
కొత్తపేట, మండపేట నియోజక వర్గాల పరిథిలో శిథిలావస్థ కు చేరుకున్న బోడిపాలెం వంతెన పున నిర్మాణానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అని కపిలేశ్వరపురం మండలం కేదార్లంక సర్పంచ్ వీది వెంకట రెడ్డి బాబు మీడియా సమావేశంలో తెలిపారు. బ్రిటిష్ పాలన లో నిర్మించిన బోడిపాలెం వంతెన మీదుగా లంకల గ్రామాలైన కేదార్లంక , నారాయణనలంక , వీదివారి లంక,గ్రామాలనుండి నిత్య0 15 వేలు మంది ప్రయాణాలు కొనసాగిస్తారని వీది వెంకట రెడ్డి బాబు అన్నారు. ఇటుక బట్టీలు అధికంగా వుండే ఈ గ్రామాల నుండి ఇతర ప్రాంతాలకు అనేక వాహనాల ద్వారా ఇటుక రవాణా ఈ వంతెన మీదుగానే జరుగుతుందన్నారు. లోడు వాహనాలు తో నిత్యం రద్దీ గా వుండే ఈ బోడిపాలెం వంతెన ఎపుడు కూలి పోతుందో తెలియని పరిస్తితిలో వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల రెండవ, తేదీన మండపేట వైసీపీ ఇంఛార్జి, ఎమ్ ఎల్ సీ తోట త్రిమూర్తులు సమక్షంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలసిన సందర్భంగా శిథిలావస్థలో ఉన్న బోడిపాలెం వంతెన గురించి విన్నవించడం జరిందని సర్పంచ్ వీది వెంకట రెడ్డి బాబు అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మా విన్నపాన్ని మన్నించి, నూతన వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు అని వీది వెంకట రెడ్డి బాబు తెలియ చేశారు.