విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
వాహనాలను వేగంగా నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు:అల్లవరం ఎసై శ్రీనువాస్ నాయక్
అల్లవరం విశ్వంవాయిస్: వాహనాలను అతివేగంగా నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎసై శ్రీనివాస్ నాయక్ అన్నారు. డాక్టర్.బిఆర్.అంబెడ్కర్ కోనసీమజిల్లాఎస్పీ ఉత్తర్వులు మేరకు అడిషనల్ ఎస్పీ,డిఎస్పి ఆదేశాల మేరకు అమలాపురం రూరల్ సిఐ సూచనలతో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల కోసం ప్రపంచ సంస్మరణ దినోత్సవం సందర్భంగా అల్లవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం అల్లవరం ఎసై శ్రీనివాస నాయక్ డ్రైవర్లుతో సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ వాహనాలను అతివేగంగా నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.రోడ్డు యాక్సిడెంట్లో బాధితులను గుర్తించి వారికి చట్టపరంగా పోలీసులు చేయవలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.