Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 6:16 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 6:16 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 6:16 PM
Follow Us

ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం వేడుకలు*

 

*కోనసీమ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో*

 

అమలాపురంనవంబర్ 21 విశ్వ వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం గడియార స్తంభం వద్ద ప్రపంచ టెలివిజన్ దినోత్సవ వేడుకలు కోనసీమ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ (కేత్వ) ఆధ్వర్యంలో ప్రపంచ టెలివిజన్ దినోత్సవంలో భాగంగా హై స్కూల్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి గడియార స్తంభం వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు అలంకరించారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి సత్యనారాయణ ను కోనసీమ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కేక్ కటింగ్ చేసినారు మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి మాట్లాడుతూ చేతి వృత్తుల ఆధారంగా టెక్నీషియన్స్ గా కొనసాగుతున్న అందరని అసంఘటిత కార్మికులుగా గుర్తించేలా ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు.

 

*కోనసీమ ఎలక్ట్రానిక్* *టెక్నీషియన్స్ వెల్ఫేర్* *అసోసియేషన్* అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీవీ టెక్నిషియన్ గా చేతి వృత్తి నేర్చుకుని జీవనం సాగిస్తున్న వారందరూ గడచిన కరోనా టైంలో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని అప్పటినుంచి సరైన వ్యాపారాలు లేక పనులు లేక సతమతమవుతున్నామని ప్రభుత్వం మమ్మలను అసంఘటిత కార్మికులుగా గుర్తించి జీవనోపాధికి చేయూతనివ్వాలని టెక్నీషియన్ వృత్తి చేయువారికి (45) వయస్సు సంవత్సరాలు దాటిన వారికి కంటి చూపు మందగిస్తుంది కాబట్టి అటువంటి వారికి పెన్షన్ ఇప్పించాలని రానున్న రోజుల్లో డిజిటల్ హవా నడుస్తుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం స్కిల్ శిక్షణ తరగతులు నిర్వహించాలని వ్యాపారాలు సాగిస్తున్న వారికి బ్యాంకు నుంచి రుణాలు సహాయంగా అందించాలని అలాగే టెలివిజన్ టెక్నీషియల్ గా కొనసాగుతున్న వారికి ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని కి వారి యొక్క డిమాండ్లు తెలిపారు.

అనంతరం కోనసీమ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ భూపయాగ్రారంలో గల అంధుల పాఠశాలకు చేరుకుని వారికి యూనియన్ తరపు నుంచి పళ్ళు, బ్రెడ్లు తినుబండారాలు (బిస్కెట్ ప్యాకెట్లు) నిత్యవసర సరుకులు (పేస్టు, బ్రష్లు, సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు) భోజనం పంపిణీ చేశారు,

 

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దొమ్మేటి గణేశ్వరరావు, గౌరవ సలహాదారు కొపనాతి స్వామి, అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు, సెక్రెటరీ గుత్తుల సోమరాజు, జాయింట్ సెక్రెటరీ పోలిశెట్టి రాము, కోశాధికారి ఎర్రం శెట్టి వెంకటరమణ, లక్ష్మీ ఎలక్ట్రానిక్స్, అధిపతి దొమ్మేటి సాయిబాబా, టెక్నీషియన్లు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement