విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
*జర్నలిస్టుల సమస్యలపై మంత్రి వేణుకి వినతి పత్రం*
*రాష్ట్ర బీసీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు*
అమలాపురం నవంబర్ 24 విశ్వం వాయిస్.
రాష్ట్ర బీసీ సంక్షేమ సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను *రాష్ట్ర బీసీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్* నాయకులు మంత్రి క్యాంప్ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్టులలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వినతిపత్రం అందజేశారు….
ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ, అక్రిడేషన్ కార్డుల సరళీకరణ, జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ హెల్త్ కార్డ్ మంజూరు వంటి సమస్యలను మంత్రివర్గ ప్రస్తావించగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు…
కార్యక్రమంలో బీసీ డబ్ల్యూ జే అసోసియేషన్ గౌరవ సలహాదారు చొల్లంగి అప్పాజీ , రాష్ట్ర అధ్యక్షుడు వేండ్ర శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి కడలి రాజు, కోశాధికారి నయినాల సత్య దుర్గా ప్రసాద్,లీగల్ అడ్వైజర్ నాగేశ్వరరావు,
ఎక్సిక్యూటివ్ సెక్రెటరీ దొమ్మేటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు నామాల వెంకటేశ్వరరావు, అధికారప్రతినిధి గుబ్బల రాము, ఉపాధ్యక్షుడు యన మదల శ్రీనివాసరావు లీగల్ అడ్వైజర్ వేమవరపు నాగేశ్వరరావు,,కార్యవర్గ సభ్యులు నులుకుర్తి శ్రీను,బొక్మా తమ్మ రాజు,గుబ్బల హరి,నరాల రాధాకృష్ణ, కాండ్రేగుల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు…