విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
*చిన్నారి చదువుకి ఆర్థిక సాయం*
*సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ పైడి రాజేష్*
*అమలాపురం నవంబర్ 25 విశ్వం వాయిస్*
డా’బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం
పి.గన్నవరంకు చెందిన *సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ పైడి రాజేష్* ఆధ్వర్యంలో తండ్రి అకాలమరణంతో ఆర్ధిక ఇబ్బందులతో చదువుకు దూరమైన చిన్నారి *పెంకే ఈశ్వర్ సుభాష్*కి మరియు తల్లి *పెంకే నాగ లక్ష్మి* *డా.బిఅర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా* *అడిషనల్ ఎస్పీ K.లతా మాధురి* చేతుల మీదుగా సహృదయంతో ఫౌండేషన్ సంస్థ *Rs*15000*/- ఆర్ధిక సహకారం అండించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ *సహృదయ ఫౌండేషన్* సంస్థ ద్వారా *పేద విద్యార్థులు చదువులు కోసం ప్రాజెక్ట్ *శిక్షా_2022* యొక్క సేవలను కొనియాడి , సంస్థ మరిన్ని సేవాకార్యక్రమాలు ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేసి టీమ్ సహృదయ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు *పైడి సురేష్ ,దిరుసుమర్తి సతీష్ , నేలపుడి రవి క్రిష్ణ* పాల్గొన్నారు…