Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 18, 2024 10:08 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 18, 2024 10:08 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 18, 2024 10:08 AM
Follow Us

నలుగురు దొంగల ముఠా అరెస్ట్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

172 గ్రాముల బంగారం స్వాధీనం

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:

 

కొత్తపేట, విశ్వం వాయిస్ : చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలు చేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు డి.ఎస్.పి కెవి రమణ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డిఎస్పీ కార్యాలయంలో మంగళవారం అరెస్టు చేసిన నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. అంబాజీపేట మండలం ముక్కామల బైపాస్ రోడ్ లో ఎస్సై చైతన్య కుమార్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా కోడేరు ఉత్తరపాలానికి చెందిన పెచ్చెట్టి విజయ్, చినమల్లం గ్రామానికి చెందిన గెద్దాడ సురేంద్ర, గుడాల చంద్రశేఖర్ స్వామి, తణుకుకు చెందిన షేక్ మున్నాలను అరెస్టు చేశామన్నారు. వీరు ఒక ముఠాగా ఏర్పడి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. వీరి వద్ద నుంచి 172.750 గ్రాముల బంగారం, 4000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 8,29,200 ఉంటుందని చెప్పారు. వీరిపై మొత్తం 9 కేసులు నమోదు చేశామని వివరించారు. గతంలోనూ ఈ నలుగురిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో కొత్తపేట ఎస్ఐ మణికుమార్, అంబాజీపేట ఎస్ఐ చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement