విశ్వంవాయిస్ న్యూస్, దేవరపల్లి:
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రావడం పార్టీ పురోగతికి సంకేతాలని గురువారం జరిగిన పార్టీ సమావేశంలో పిసిసి కార్యదర్శి,గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జ్ జ్యేష్ఠ సతీష్ బాబు పేర్కొన్నారు.అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ,ఛత్తీస్ గఢ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో చెరొక స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ప్రజలు మార్పును ఆహ్వానిస్తున్నదానికి సూచనని,రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం తథ్యమని జ్యేష్ఠ ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.