విశ్వంవాయిస్ న్యూస్, దేవరపల్లి:
నల్లజర్ల మండలంలోని దూబచర్ల డైట్ కాలేజ్ నందు ఇటీవల జరిగిన కళా ఉత్సవ్-2022 జిల్లా స్థాయి పోటీలలో,జానపద నృత్యాల విభాగంకి సంబంధించి జిల్లా స్థాయి తృతీయ బహుమతిని శ్రీ సంఘమిత్ర విద్యాలయానికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని చేబ్రోలు వర్ష అందుకున్న సందర్భంగా దూబచర్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలలో అంతర్గతంగా దాగివున్న టాలెంట్ ని వెలికితీసే ప్రయత్నంలో,ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ కెల్లా వంశీకృష్ణ, ప్రధానోపాధ్యాయులు గిరికుమార్,శివకృష్ణ,వెంకటకృష్ణ,పి.సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.