ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ను ప్రారంభించడం జరిగింది.
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
“రాజమండ్రిలో రాజసం” అంటూ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన వస్త్ర వ్యాపార సంస్థ శుభమస్తు షాపింగ్ మాల్ ను శుక్రవారం సినీ హీరో నిఖిల్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్, శ్రీ ముఖి గ్రాండ్ గా ప్రారంభించారు. నెల్లూరు, తిరుపతి విజయవాడ, గుంటూరు లొకేషన్ లలొ సామాన్యుల నుండి సంపన్నుల వరకు షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి వస్త్ర ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శుభమస్తు షాపింగ్ మాల్ వారు మన రాజమండ్రి లో ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ను ప్రారంభించడం జరిగింది.
ఈ ప్రారంభోత్సవంలో సినీ తారలు నిఖిల్, అను ఇమ్మానుయేల్, శ్రీముఖి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఆ తర్వాత షాపింగ్ మాల్ అన్ని ఫ్లోర్లు తిరుగుతూ అభిమానులకు సెల్ఫీలు హల్ చల్ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎం పి మార్గని భరత్ రామ్,శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,జక్కంపూడి రాజా,ఆదిరెడ్డి భవాని,ఆదిరెడ్డి అప్పారావు, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి,గన్ని కృష్ణ , శ్రీఘాకొళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం,చందన నాగేశ్వర్,సత్య కుమార్,రౌతు సూర్య ప్రకాష్ రావు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్, బయ్యా రాణా ప్రతాప్ మరియు కుటుంబ సభ్యులు, స్నేహితులు,సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.