విశ్వంవాయిస్ న్యూస్, అయినవిల్లి:
*నాగరాజుకు ఆర్థిక సాయం అందించిన*
*అబ్బిరెడ్డి రామదాసు చారిటబుల్ ట్రస్ట్*.
*ప్రతినిధులు అబ్బిరెడ్డి సురేష్*
అయినవిల్లి మండలం డిసెంబర్ 14 విశ్వం వాయిస్
అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామ పంచాయతీ కె.పెదలంక కు చెందిన
జల్లి నాగరాజు(30) రెండు సంవత్సరాల నుంచి మూత్ర పిండాలు వ్యాధితో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆకస్మిక వరదలు రావడం అబ్బిరెడ్డి రామదాసు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అబ్బిరెడ్డి సురేష్ ఆహార పొట్లాలు,నిత్యవసర దినుసులు వస్తువులు పంపిణీ సందర్భంలో బాధితుని పరిస్థితి చలించి మూత్రపిండాల మార్పిడి చికిత్సకు తమ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం 10,000 పదివేల రూపాయల చెక్కును తన పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవకులు గంగుమళ్ళ శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు.గంగుమళ్ళ మాట్లాడుతూ అబ్బిరెడ్డి రాందాసు వారసుల సేవాస్ఫూర్తి అభినందనీయమని 167 సంవత్సరాల చరిత్ర కలిగిన అబ్బిరెడ్డి రాందాసు చెడీ తాళింఖానా కొనసాగిస్తూ కూడా ఈ నాలుగవ తరం వారసులు సేవా సంస్థగా తీర్చిదిద్దటం అభినందనీయమని సామాజిక సేవలే పెద్దల ఆశయాలకు కొనసాగింపు అవుతాయని ఆపదలో ఆదుకున్న వారు దేవుని తో సమానం అన్నారు.నాగరాజు సొంత సోదరుడే కిడ్నీ దాతగా ముందుకు రావడం సమాజానికి కుటుంబ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ఉందన్నారు. అత్యంత ఖర్చుతో కూడిన వైద్యం కారణంగా దాతలు మరింతగా ఆదుకోవాలని కోరారు.దళిత యువ నాయకులు గన్నవరపు ఆనంద్,ధర్ నేతృత్వంలో సురేష్ పుట్టినరోజు సందర్భంగా అయినవిల్లి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో స్థానిక సేవా సంస్థ కన్వీనర్ అబ్బిరెడ్డి మూర్తి,ఎంపీ యుపి స్కూల్ మాస్టర్ వాకాడ శ్రీనివాస్,గెల్లా అశోక్,వార తిరుమల,వార ప్రసాద్,వార అశోక్,వార ఏడుకొండలు,వల్లభరెడ్డి వాసు, నల్లా నాగు,రేవు నాగబాబు,రేవు నాగభూషణం,చిల్లే అజయ్,వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.