విశ్వంవాయిస్ న్యూస్, దేవరపల్లి:
మండలంలోని యర్నగూడెం బిసి ఏరియా మద్దిపాటి ఫంక్షన్ హాల్ వద్ద ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని స్థానిక ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ రకాల వ్యాధిగ్రస్తులను పరీక్షించి అవసరమైన మందులను అందించడమే గాక తగుసూచలను డాక్టర్ మాధవి అందించారు.అనంతరం డాక్టర్ మాధవి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలని,యోగా, ప్రాణాయామం,క్రీడలు వంటి వ్యాయామాలు దినచర్యలో భాగంగా చేసుకోవాలని,రోగ లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ద చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని,ప్రభుత్వం ఉచితంగా అందించే వైద్య సహాయం పొందాలని సూచించారు.ఈ నాటి వైద్య శిబిరంలో పలు అనారోగ్య సమస్యలు ఉన్న 60 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.