రేపు వాహనాల బహిరంగ వేలం
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్ళరేవు : 27-12-2022 : తాళ్ళరేవు మండలం ఎస్ఇబి స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 28న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈబి సి ఐ జీవీ భవాని ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడలో ఏ ఆర్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం పాట జరుగుతుందన్నారు. ఈ పాటలో పాల్గొనేవారు 2000 రూపాయలు ధరావత్తు చెల్లించాలని తెలిపారు.