విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
ఫిబ్రవరి 27వ తేదీ, 2023 న జరగబోయే శ్రీ.ముత్యాలమ్మ తల్లి జాతర( బడా జాతర) మహోత్సవానికి సంబంధించిన సమావేశం, ఒరిస్సా రాష్ట్రం, మల్కాజ్గిరి జిల్లా, మన్యంకొండ గ్రామం నందు జరిగింది. ఈ సమావేశంలో మల్కాజ్గిరి జిల్లా అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జాతర కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు ప్రసంగిస్తూ కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని, చింతూరు మండలం, మోతుగూడెం, పొల్లూరు గ్రామాలలో A. P. GEN.CO… అధికారులతో ఈ మన్యంకొండ జాతర ఏర్పాట్లకు సంబంధించిన సమావేశం జరుపుతామని తెలిపారు. సీలేరు నది, వాటర్ ఫాల్స్( జాతర పనులకు) సంబంధించిన విషయాల గురించి చర్చించడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు…