విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:
మండల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎంపీపీ మార్గన గంగాధర్ రావు అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట కొత్త రామాలయం వద్ద బుధవారం డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మార్గాన గంగాధర్ రావు మాట్లాడుతూ మండల పరిషత్ నిధులు 4 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గూడపాటి రమాదేవి ప్రవీణ్ కుమార్, ముత్యాల వీరభద్ర రావు, విల్ల వీర్రాజు, రేవడి నాగలక్ష్మి నాగేశ్వరరావు వైసిపి నాయకులు పాల్గొన్నారు.