Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 4:38 PM

ACTIVE

India
44,500,353
Total active cases
Updated on March 28, 2024 4:38 PM

DEATHS

India
533,540
Total deaths
Updated on March 28, 2024 4:38 PM
Follow Us

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొండేటిని నిలదీసిన పసుపల్లి గ్రామస్తులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అంబాజీపేట:

పసుపల్లి గ్రామంలో తక్షణమే రోడ్లు వేయించండి అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

 

 

అంబాజీపేట మండలం పసుపల్లిలో గ్రామంలో దశాబ్దాలుగా రాజకీయ నాయకుల వల్ల మా గ్రామసమస్యలు తీరింది లేదు అనే పసుపల్లి గ్రామస్తులు పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుని నిలదీశారు. పసుపల్లి గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే కొండే చిట్టిబాబు ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లారు. గ్రామస్తులు మా గ్రామంలో రోడ్లు లేవని ఎమ్మెల్యేను నిలదీశారు. తమరు ఎలక్షన్లో వచ్చారు తిరిగి మళ్లీ ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ఇప్పుడు కనిపించారా అని అడిగారు. ఓట్ల కోసం మాత్రమే మా గ్రామం.. అవసరం అని గ్రామస్తులు అన్నారు .

పసుపల్లిలో మొదటి గడపకు వెళ్ళకముందే గ్రామస్థులు గందరగోళ్ల పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డగించారు. పలువురు నాయకులు పసు పల్లి గ్రామానికి రోడ్లు వేయిస్తామంటూ గ్రామస్తులతో అన్నప్పటికీ గ్రామస్తులు వినలేదు. మండల అధ్యక్షులు చినబాబు చొరవ తీసుకుని ఆవేశపడకండి త్వరలో రోడ్లు వేయిస్తామని చెప్పగా.. అదే ఆవేశంతో నీ కెందుకు ఉంటుంది బాధ… నీ వక్కలంక రోడ్డు బాగానే వేయించుకున్నావ్… అమలాపురంలో ఉంటున్నావ్.. అంటూ మారోడ్లలో మా ఇబ్బందులు మీకెం తెలుసు.. ?అని ఆగ్రహంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మే నెలలో రోడ్లు వేయిస్తాం .. అంటూ ఎంఎల్ఎ భరోసా భరోసా ఇచ్చారు ఎస్ఐ చైతన్య కుమార్ చొరవతో ముందుకు గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement